News March 30, 2025
ప్రశాంతంగా కొనసాగుతున్న ఫకీర్ షావలి జాతర

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో ఫకీర్ షా వలి జాతర ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. హిందూ, ముస్లింలు సంయుక్తంగా జరుపుకొంటున్న ఈ జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎల్కతుర్తి ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News April 1, 2025
కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చేటని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సెంటర్లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పానీయాల్లో అధికంగా ఉండే సుక్రోజ్తో శరీరానికి ప్రమాదమేనని ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వెల్లడయింది. అధిక శాతం సుక్రోజ్ ఉండే పానీయాలతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతోపాటు జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News April 1, 2025
ఈనెల 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్: విశాఖ డిఈవో

జ్ఞానాపురంలోని సోఫియా జూనియర్ కళాశాలలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు డిఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 900 మంది ఉపాధ్యాయులు, అధికారులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.
News April 1, 2025
నంద్యాల జిల్లాలో 84.63% పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల సమయానికి నంద్యాల జిల్లాలో 84.63% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,14,590 మందికి గాను, 1,81,608 మందికి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ సొమ్మును అందజేశారు.