News December 17, 2025

ప్రశాంతంగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు: ఎస్పీ నరసింహ

image

జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ నరసింహ వెల్లడించారు. 1,500 మంది పోలీసు సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఎన్నికలను విజయవంతం చేశారని కొనియాడారు. తనిఖీల్లో భాగంగా రూ.10.53 లక్షల విలువైన మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నామని, 1,488 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Similar News

News December 21, 2025

అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం

image

శబరిమల నుంచి HYD వస్తున్న అయ్యప్ప భక్తులకు పెను ప్రమాదం తప్పింది. కడప(D) గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, ఆరుగురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. ఆ లారీని ఢీకొట్టకపోయుంటే బస్సు లోయలో పడే అవకాశముండేదని, అదే జరిగి ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగుండేదని భక్తులు వాపోయారు.

News December 21, 2025

ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

image

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో శనివారం పెను ప్రమాదం తప్పింది. శబరిమల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు లోయల పడే అవకాశం ఉండేదనీ, ఒకవేళ ఇదే జరిగింటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని యాత్రికులు వాపోయారు.

News December 21, 2025

తిమ్మాపూర్: గ్రామీణ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

image

ఎల్ఎండి కాలనీలోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణకు ధరఖాస్తులను కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ సంపత్ తెలిపారు. టైలరింగ్ శిక్షణ ఈనెల 30న ప్రారంభిస్తామని, శిక్షణ కాలం 31 రోజులని, శిక్షణ సమయంలో ఉచిత వసతి భోజన సదుపాయాలంటాయని చెప్పారు. 18 -45 ఏళ్ల పదోతరగతి చదివిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలు అర్హులని పేర్కొన్నారు.