News April 2, 2025
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

కొత్తగూడెం జిల్లాలో మార్చి 21 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి ఎం వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్ మాధవరావు తెలిపారు. చివరగా సోషల్ స్టడీస్ పరీక్షకు 12273 మంది విద్యార్థులకు గాను 12240 విద్యార్థులు హాజరుకాగా 33 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. సప్లమెంటరీ విద్యార్థులు 26 మంది గాను 17 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు
Similar News
News November 14, 2025
మెదక్ జిల్లాలో కవిత పర్యటన

కవిత జాగృతి జనంబాట నేటి నుంచి మెదక్ జిల్లాలో ప్రారంభం కానుంది. నర్సాపూర్ నలంద స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొంటారు. రెడ్డిపల్లిలో రీజనల్ రింగ్ రోడ్డు, కాల్వలు, హై టెన్షన్ లైన్ కోసం భూములు కోల్పోయిన బాధితులతో సమావేశం. పోతన్ శెట్టిపల్లిలో వివిధ పార్టీల నుంచి జాగృతి చేరికలు, ఘణపూర్ ఆనకట్ట సందర్శన, ఏడుపాయల వన దుర్గా అమ్మవారి దర్శనం, మెదక్ చర్చ్, పల్లికొట్టాల డబుల్ బెడ్ రూం సందర్శిస్తారు.
News November 14, 2025
వరంగల్: రైతులకు కొరకరాని కొయ్యగా మారిన కొత్త నిబంధనలు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పత్తి కొనుగోలు నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీసీఐ అధికారులు ఒక్కో రైతు ఒక ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేయడంతో ఎక్కువ దిగుబడి సాధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కపాస్ యాప్ ద్వారా మాత్రమే స్పాట్ బుకింగ్ చేయాలనే నియమం రైతుల ముందున్న మరో అడ్డంకిగా మారింది.
News November 14, 2025
బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!

బిహార్లో 243 అసెంబ్లీ స్థానాలతో పలు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బిహార్లో మొత్తం 2,616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38 జిల్లాల్లోని 46 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఈసీ 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.


