News August 25, 2025
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ములుగు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగలను భక్తి భావంతో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈ సంవత్సరం ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో ఆ శాఖ సిబ్బంది అలర్ట్ ఉండాలన్నారు.
Similar News
News August 25, 2025
జిల్లాలో సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగు నేత్రదాన పక్షోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 40 జాతీయ పక్షోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేత్రదానం చేయండి.. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించండి అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించాలన్నారు. మరణానంతరం 6-8 గంటల్లో నేత్రదానం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
News August 25, 2025
లారీ కింద నలిగిపోయిన తండ్రీ కూతుళ్లు!

TG: ఊహించని ప్రమాదంలో ఒకేసారి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి(D) చేవెళ్లలో చోటుచేసుకుంది. గురుకుల స్కూలులో చదువుతున్న కూతురు కృప(12)ను తండ్రి రవీందర్(32) బైకుపై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. టైర్ల కింద నలిగిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.
News August 25, 2025
తెనాలి: వందేళ్లు దాటినా కష్టాలే.. పింఛన్ కోసం వృద్ధుడి ఆవేదన

తెనాలిలోని మల్లెపాడుకు చెందిన శతాధిక వృద్ధుడు భూషయ్య దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన ఈయన, ప్రస్తుతం వారి ఆదరణకు నోచుకోక జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఆలపాటి ధర్మారావు హయాంలో యడ్లపల్లి పంచాయతీ మెంబరుగా పనిచేశారు. భూషయ్యకు వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛను కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.