News August 27, 2025
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోండి: ఎస్పీ

వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పోలీసు వారికి ప్రజలు సహకరించాలని, పర్యావరణాన్ని కాపాడేందుకుగాను మట్టి ప్రతిమలను వినియోగించాలన్నారు.
Similar News
News August 27, 2025
రాజమండ్రిలో ద్వాపర యుగానికి చెందిన విఘ్నేశ్వరుడు ఆలయం

రాజమండ్రిలోని నాళం భీమరాజు వీధిలో కొలువైయున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం ద్వాపర యుగానికి చెందినదిందని భక్తుల విశ్వాసం. సుమారు 200సం.లు క్రితమే ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ, ఆలయ పునః నిర్మాణం జరిగిందిని స్థానికులు తెలిపారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకొని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సర్ ఆర్థర్ కాటన్ దొర 1858లో ధవలేశ్వరం బ్యారేజీ పూర్తయ్యాక ఈ ఆలయానికి గంటను భక్తితో బహుకరించినట్లు చెబుతున్నారు.
News August 27, 2025
రాజమండ్రి: బార్ లైసెన్సుల కోసం స్పందన అంతంత మాత్రమే

తూ.గో బార్లకు దరఖాస్తులదారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో మరో 22 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు కోరగా.. మంగళవారం గడువు ముగిసే నాటికి రాజమండ్రి నుంచి 4, ఇతర ప్రాంతాల నుంచి మరో 4 దరఖాస్తులు మాత్రమే ఎక్సైజ్ శాఖకు అందాయి. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు, అధిక లైసెన్స్ ఫీజులు, ఇతర కారణాలతో లైసెన్సుల కోసం వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కాగా దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 29 వరకు పెంచారు.
News August 27, 2025
రాజమండ్రి: కలువ పువ్వుల కోసం కాలువలోకి దిగి వ్యక్తి మృతి

కొంతమూరు గ్రామానికి చెందిన వంక త్రిమూర్తులు అనే వ్యక్తి కాలువలోకి దిగి కలువ పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం త్రిమూర్తులు అనే వ్యక్తి వినాయక చవితి సందర్భంగా కలువ పువ్వులు కోసం కాలువలోకి దిగాడు. కాలు జారి పడటంతో మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.