News October 22, 2025
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికలతో ఆయా జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ వీక్షణ సమావేశానికి హాజరయ్యారు.
Similar News
News October 23, 2025
మంచిర్యాల: వైన్స్ దరఖాస్తులు నేటితో పూర్తి

గురువారంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయడానికి గడువు ముగుస్తుందని జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. బుధవారం మద్యం దుకాణాలకు 7 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో మొత్తం జిల్లాలో మద్యం దుకాణాలకు 949 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 27న షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు.
News October 23, 2025
తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితకథ.. టైటిల్ రోల్లో స్టార్ హీరో

ప్రజానాయకుడు, సైకిల్పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా పేరున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ మేరకు మూవీ యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి పరమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు శాసనసభ నుంచి ఐదు సార్లు MLAగా ఎన్నికయ్యారు.
News October 23, 2025
ములుగు: ఇకనుంచి జరిమానా కాదు.. వాహనం సీజ్!

అక్రమ వసూళ్లకు ఆర్టీవో చెక్ పోస్ట్లు కేరాఫ్గా మారాయనే ఆరోపణల నేపథ్యంలో వాటిని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, ములుగు(D)లో మొదటినుంచి ఒక్క చెక్ పోస్ట్ లేదు. ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్న జిల్లా మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఏపీ వాహనాలు వచ్చిపోతుంటాయి. నిఘాను పెంచిన అధికారులు పర్మిట్ లేకుంటే ఇకనుంచి జరిమానా కాకుండా ఏకంగా వాహనాన్ని సీజ్ చేయనున్నారు.


