News August 18, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. పత్తి ధర ఎంతంటే..?

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,720 ధర పలకగా.. సోమవారం రూ.7,660కి పడిపోయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
Similar News
News August 20, 2025
ఆర్గనైజేషన్ సెక్రటరీగా జగిత్యాల జిల్లా వాసులు

తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జగిత్యాల జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మోతె ఉమాకాంత్, కార్యదర్శిగా మునుగోటి రమేష్ శర్మలను నియమిస్తూ తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ మంగళవారం DSR గార్డెన్, హన్మకొండలో ధ్రువీకరణ పత్రం అందజేశారు. వీరి నియామకం పట్ల రాయికల్, జగిత్యాల బ్రాహ్మణ సంఘం సభ్యులు, తెలుగు పండితులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
News August 20, 2025
ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యం: చంద్రబాబు

AP: రతన్ టాటా భరతమాత ముద్దు బిడ్డ అని CM చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బు సంపాదించాలని చూస్తారని, టాటా మాత్రం సంపాదనను ఇతరులకు పంచేవారని చెప్పారు. RTIH ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు అంతా ITదేనని గుర్తు చేశారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే సంపద వస్తుందన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడు ఉండాలని పనిచేశామని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యమని తెలిపారు.
News August 20, 2025
UPI: స్కాన్ చెయ్ సరుకులు తెచ్చెయ్!!

ఇంటి పక్కన కిరాణా షాపు నుంచి షాపింగ్ మాల్ వరకు కౌంటర్ ఏదైనా.. UPI స్కాన్తో కొనేస్తున్నాం. ఈ జులైలో 303 కోట్ల ట్రాన్సాక్షన్లతో (₹64,881Cr) గ్రోసరీస్ టాప్ UPI కేటగిరీగా ఉంది. అంటే పాల ప్యాకెట్లు, ఉప్పు, పప్పులు వగైరా కిరాణా సరుకులు, కాయగూరలకు ఎక్కువ UPI పేమెంట్స్ చేస్తున్నారు. ఇక టీ, టిఫిన్, స్నాక్స్ సెంటర్లది సెకండ్ ప్లేస్ (100 కోట్ల పేమెంట్లు, ₹13794 Cr) . మీరు UPIని ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు?