News October 22, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. పత్తి ధర ఎంతంటే?

నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో గత వారంతో పోలిస్తే పెరిగింది. గత వారం క్వింటా పత్తి ధర రూ.6,930 పలకగా.. నేడు రూ.7,000 మార్క్ దాటి 7,010 అయ్యింది. నిన్న అర్ధరాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ ఆవరణలో కొంచెం బురదమైనప్పటికీ, ఉదయం నుంచి క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
Similar News
News October 22, 2025
అధికారంలోకి రాగానే బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేస్తాం: బొత్స

AP: అనకాపల్లి(D) రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఆందోళన చేస్తున్న మత్స్యకారులు సంఘ విద్రోహ శక్తులా? వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేస్తాం. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారు’ అని స్పష్టం చేశారు.
News October 22, 2025
కృష్ణా: మంచు మొదలైంది బాసు.. జాగ్రత్తగా నడుపు.!

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయం చలితోపాటు మంచు మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రయాణం చేసే వారికి జాగ్రత్త అవసరం. మంచు పెరగడంతో దారులు కనబడటం కష్టతరం కావచ్చు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలి. జాగ్రత్త మీ వేగం మీ కుటుంబానికే కాదు.. మరో కుటుంబానికి కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది.
News October 22, 2025
GNT: సముద్ర స్నానాలు.. జాగ్రత్త వహించండి.!

కార్తీక మాసం సందర్భంగా సముద్ర, నది స్థానాల్లో స్నానం చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. మన ఉమ్మడి జిల్లా వారు. సూర్యలంక బీచ్, చీరాల బీచ్, కృష్ణ నది ప్రాంతాలలో పోలీస్ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కావున సముద్ర, నది స్నానాలకు వెళ్లేవారు లోతులను గమనించటంతో పాటు పిల్లలపై శ్రద్ధ వహించి క్షేమంగా ఉండాలని Way2news ఆశిస్తుంది.