News August 26, 2025

ప్రియాంకా గాంధీని కలిసిన ఖమ్మం ముఖ్య నేతలు

image

బిహార్‌లో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా AICC అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న యాత్రకు తమ మద్దతు తెలిపారు.

Similar News

News August 26, 2025

వినాయక నవరాత్రి ఉత్సవాలకు గట్టి బందోబస్తు: ఖమ్మం సీపీ

image

వినాయక నవరాత్రి ఉత్సావాల్లో ప్రజా భద్రతతో పాటు ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా అధికారులు సమష్టిగా కృషిచేయాలని సీపీ సునీల్ దత్ అదేశించారు. పోలీస్ కాన్ఫిరెన్స్ హల్‌లో మంగళవారం నేర సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విధిగా మండపాలను సందర్శించి నియమ, నిబంధనలు పాటించేలా చూడాలని చెప్పారు. వినాయక నవరాత్రి ఉత్సావాలకు పటిష్టమైన బందోబస్తు చేయాలన్నారు.

News August 26, 2025

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: ఖమ్మం కలెక్టర్

image

మహిళలు లాభసాటి వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం కావాలని, మరొకరికి ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం నగరం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా, శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంను సందర్శించారు. మహిళా ప్రాంగణం పరిసరాలను కలియ తిరిగిన కలెక్టర్, ప్రాంగణానికి కావలసిన మౌళిక సదుపాయాల గురించి మహిళా ప్రాంగణం మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు.

News August 26, 2025

ఖమ్మం: ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ప్రభుత్వ, లోకల్ బాడీ, ఎయిడెడ్, కేజీబీవీ, తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల యాజమాన్యాల హెచ్ఎంలు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. హెచ్ఎంలకు 15 సంవత్సరాలు, ఉపాధ్యాయులకు 10 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలన్నారు. ఈ నెల 28 లోగా డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో ధ్రువీకరించి అందజేయాలని సూచించారు.