News December 13, 2025
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ఢిల్లీ సర్కార్ చట్టం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. తాజాగా దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం అనుమతించిన ఫీజు ధరలనే స్కూల్స్ వసూలు చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25, అడ్మిషన్ ఛార్జీలు రూ.200గా నిర్ణయించారు. 3 ఏళ్లపాటు ఫీజులు స్థిరంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఇటువంటి చట్టం తెలుగు రాష్ట్రాల్లోనూ తీసుకొస్తే బాగుంటుంది కదా?
Similar News
News December 31, 2025
2025లో కష్టసుఖాల్లో తోడున్న వారికి ‘థాంక్స్’ చెప్పండి!

నేటితో 2025 ముగుస్తోంది. ఈ ఏడాది మనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను, కొన్ని గుణపాఠాలను ఇచ్చి ఉండొచ్చు. గెలుపులో నవ్వులు, కష్టాల్లో కన్నీళ్లు.. ఇలా ప్రతీ అనుభవం మనల్ని మరింత దృఢంగా మార్చింది. కష్టకాలంలో తోడుగా ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీని అస్సలు మర్చిపోకండి. వారికి థాంక్స్ చెప్పండి. డబ్బు, హోదా కంటే కుటుంబంతో గడిపే సమయమే ఎంతో విలువైనదని గుర్తుంచుకోండి. ఈ ఏడాది మీకు మంచి/ చెడు జరిగితే కామెంట్లో పంచుకోండి.
News December 31, 2025
నువ్వుల పంటలో ఆకు, కాయ తొలుచు పురుగు-నివారణ

ఈ పురుగు తొలి దశలో చిన్న చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకొని లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగులు ఆకులనే కాకుండా మొగ్గలు, పువ్వులతో పాటు కాయలోని గింజలను కూడా తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి క్వినాల్ఫాస్ 20ml లేదా క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News December 31, 2025
సీరియల్ నటి ఆత్మహత్య.. కారణమిదే!

సీరియల్ నటి నందిని(26) <<18707144>>ఆత్మహత్య<<>>కు పాల్పడిన ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగు చూసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, నటన అంటే ఇష్టమని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మరణానికి కారణమని తెలిపారు. కాగా నందిని తండ్రి(ప్రభుత్వ ఉద్యోగి) 2023లో మరణించారు. దీంతో ఆ ఉద్యోగం చేయాలని నందినిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు.


