News October 6, 2025
ప్రైవేట్ స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణమా?: భూమన

కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించాలనే TTD తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ‘జీ-స్క్వేర్ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న ఆ స్థలంపై ఈడీ విచారణ సాగుతోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే టీటీడీ నిధులతో ఆ స్థలంలో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. జీ-స్క్వేర్ సంస్థతో బీఆర్ నాయుడికి ఏమైనా లింకులా ఉన్నాయోమోనని మాకు అనుమానం వస్తోంది’ అని భూమన అన్నారు.
Similar News
News October 6, 2025
విష్ణువుపై వ్యాఖ్యలు.. CJIపై దాడికి కారణమిదేనా?

SCలో CJI BR గవాయ్పై ఓ వ్యక్తి వస్తువు విసిరేందుకు యత్నించడం తెలిసిందే. MPలోని ఖజురహో టెంపుల్లో ధ్వంసమైన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలన్న పిటిషన్పై విచారణ సమయంలో CJI వ్యాఖ్యలే దాడికి కారణంగా తెలుస్తోంది. ‘ఈ సైట్ ASI పరిధిలో ఉంది. మీరు విష్ణువు పరమ భక్తుడని చెబుతున్నారు కదా. వెళ్లి ప్రార్థించండి. ఏదైనా చేయమని అడగండి’ అంటూ పిటిషన్ను కొట్టేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
News October 6, 2025
RR: గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఖరారైన రిజర్వేషన్లపై ఆయా పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు ఉత్సాహం చూపుతుండగా.. MPTC, ZPTC స్థానాల నుంచి పోటీ చేసే వారి పేర్లను సేకరించి పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కాగా, కోర్టు తీర్పు తర్వాత ముందుకెళ్లాలని పార్టీలు యోచిస్తున్నాయి.
News October 6, 2025
HYD: మల్లేశ్కు ఉద్యోగం కల్పించిన NIMS డైరెక్టర్

ఎత్తు తక్కువ కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న శంషాబాద్ వాసి మరుగుజ్జు మల్లేశ్కు NIMS డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప అండగా నిలిచారు. తన బాధ విన్న ఆయన, మల్లేశ్కు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చి వెంటనే లిఫ్ట్ ఆపరేటర్గా నియామకపత్రం అందజేశారు. దీంతో మల్లేశ్ ఆనందం వ్యక్తం చేస్తూ, తన జీవితానికి కొత్త ఆశ కలిగించిన బీరప్పకి కృతజ్ఞతలు తెలిపాడు.