News July 5, 2024
ప్రొద్దుటూరులో APEAPCET కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720095140468-normal-WIFI.webp)
ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో APEAPCET-2024 కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్ సెంటర్కు కోఆర్డినేటర్గా ప్రొఫెసర్ కేవీ రమణయ్యను అధికారులు నియమించారు. ఆయన మాట్లాడుతూ..నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. సందేహాలుంటే హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News July 8, 2024
కడప: విద్యా శాఖ ఆర్జేడీపై బదిలీ వేటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720422166315-normal-WIFI.webp)
కడప జిల్లా పాఠశాల ఆర్జేడీ రాఘవరెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఇటీవల రాఘవరెడ్డిపై అవినీతి, అక్రమాలపై ఆరోపణలు రావడంతో విద్యాశాఖ విచారణ చేపట్టారు. క్రమశిక్షణా చర్యల కింద రాఘవరెడ్డిని విద్యాశాఖ అధికారులు బదిలీ చేశారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి వరకు కడప పాఠశాల ఆర్జేడిగా కర్నూలు డీఈఓ శామ్యూల్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
News July 8, 2024
YSRకు మాజీ సీఎం జగన్ నివాళి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720405558593-normal-WIFI.webp)
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద తన తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News July 8, 2024
రాయచోటిలో వ్యక్తి దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720403811416-normal-WIFI.webp)
రాయచోటిలో ఆదివారం దారుణ హత్య జరిగింది. రాయచోటి మసీదు వీధికి చెందిన ఇర్షాద్ అలీ రెడ్డిబాషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె సోదరుడు ఇబ్రహీం(22) తరచూ మద్యం తాగి సోదరి ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో విసుగుచెందిన ఇర్షాద్ బావమరిదిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మద్యం తాగుదామని చెప్పి గున్నికుంట్లకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి బీరుసీసాతో గొంతు కోసి హత్య చేశాడు.