News February 5, 2026

ప్రొద్దుటూరు అటవీ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ ఆదేశం.!

image

ప్రొద్దుటూరులోని పెన్నా నది, రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కడపలో కలెక్టర్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలో ఉన్న 1044 ఎకరాల ఫారెస్ట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News February 21, 2026

కడప జిల్లాలో ఆ కుటుంబం శకం ముగియనుందా?

image

బద్వేల్లో 60 ఏళ్లుగా బిజి వేముల వీరారెడ్డి కుటుంబం పాలకవర్గం లేదా ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. అయితే బద్వేల్ రిజర్వ్‌డ్‌లోకి వెళ్లడంతో వారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రితేశ్ రెడ్డిని తప్పించి DCCB ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ఇన్‌ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే 60 ఏళ్ల తర్వాత ఆ కుటుంబం కథ ముగుస్తుందనే చెప్పవచ్చు.

News February 21, 2026

పుష్పగిరి ఆలయంలో అద్భుత శిల్పాలు

image

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ, శ్రీవైద్యనాథ ఆలయాల్లోని కుడ్యశిల్పాలు విశేషంగా ఉన్నాయని చరిత్రకారుడు రమేష్ తెలిపారు. ఒకే ఇతివృత్తంతో, భిన్న భంగిమల్లో శివుని ఊర్ధ్వ, చతుర తాండవాలు, పార్వతీదేవి కూర్చున్న, నిలుచున్న రూపాలు చెక్కారు. ఒకే శిల్పంలో వృషభం, నందికేశ్వరుడు వేర్వేరుగా ఉండటం ఆనాటి శిల్పుల అద్భుత నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.

News February 21, 2026

మదనపల్లె: కులవర్ధన్ తల్లి కోసం వెతుకులాట

image

మదనపల్లెలో బాలిక హత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. A1 కులవర్ధన్ చనిపోయిన విషయం తెలిసిందే. A2గా అతని తల్లి అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.