News March 22, 2025
ప్రొద్దుటూరు: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే జిల్లా బహిష్కరణ

నేటి నుంచి జరగనున్న IPL క్రికెట్ సందర్భంగా బెట్టింగ్ అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఎస్పీ భావన పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లపై ప్రత్యేక నిఘా ఉందని, గతంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన వారిని ఇప్పటికే గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. పదే పదే బెట్టింగ్ నిర్వహిస్తే జిల్లా బహిష్కరణ ఉంటుందన్నారు.
Similar News
News May 8, 2025
పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News May 8, 2025
కడప: రిమ్స్ ప్రిన్సిపల్గా డాక్టర్ జమున

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.