News March 28, 2024
ప్రొద్దుటూరు: ‘చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మవద్దు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711547365052-normal-WIFI.webp)
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు విడుదల చేసే మేనిఫెస్టోను ప్రజలు ఎవరు నమ్మవద్దని సీఎం జగన్ కోరారు. సిద్ధం సభలో సీఎం ప్రసంగిస్తూ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ చెప్పిన మేనిఫెస్టోను 99% నెరవేర్చినట్లు సీఎం పేర్కొన్నారు. మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పవిత్రమైన గ్రంథంగా భావించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సాధించడానికి మేము సిద్ధం అని పేర్కొన్నారు.
Similar News
News July 5, 2024
రేపు కడపకు రానున్న YS జగన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720161534435-normal-WIFI.webp)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.
News July 5, 2024
రాజంపేట సబ్ జైలు నుంచి ఖైదీ పరార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720142882578-normal-WIFI.webp)
రాజంపేట సబ్ జైలు నుంచి బాషా అనే ఖైదీ గురువారం పరార్ అయ్యారని పట్టణ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఉదయం 8-9 గంటల సమయంలో వంట చేయడానికి ఖైదీలను జైలు గది నుంచి బయటకు వదిలిన సమయంలో దుప్పట్లను తాడుగా చేసుకుని గోడ దూకి పరారయ్యాడని జైలర్ మల్లారెడ్డి తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. హత్య కేసులో ముద్దాయి బాషా గత ఏడాది నవంబర్ నుంచి జైలులో ఉన్నారు. ఇతనిది రైల్వే కోడూరు అని తెలిపారు.
News July 5, 2024
కడప: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720136372935-normal-WIFI.webp)
కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సూర్యరావు తెలిపారు. వాణిజ్యశాస్త్రం, భౌతికశాస్త్రం, ఆధునిక ఉర్దూ సబ్జెక్టులలో బోధించుటకు అర్హులైన అధ్యాపకులు కావాలన్నారు. మాస్టర్ డిగ్రీలో 50% మార్కులు కలిగిన వారు అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.