News August 10, 2024

ప్రొద్దుటూరు: ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. అరగంట ఆగిన రైలు

image

ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 9.30కు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చి ఆగింది. బండిని ఆపే సమయంలో వర్షం పడగా, పదే పదే బ్రేకులు వేయడంతో ఏసీ బోగి చక్రాల కింద ఉన్న బ్రేకర్ నుంచి పొగ వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య ఉందని గుర్తించి, దాన్ని అధికారులు సరిచేయగా 30నిమిషాల తర్వాత రైలు బయలుదేరింది.

Similar News

News January 8, 2026

ఒంటిమిట్ట: అమ్మమ్మను కత్తితో పొడిచాడు..!

image

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాఘవమ్మ(70) పొలంలో పనిచేస్తుండగా ఆమె మనవడు నంద(20) కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను 108లో కడప రిమ్స్‌కు తరలించారు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతేనే దాడి చేసినట్లు సమాచారం. నంద తల్లి కువైట్‌లో ఉండగా.. ప్రస్తుతం అతను అమ్మమ్మ రాఘవమ్మ దగ్గర ఉంటున్నాడు.

News January 8, 2026

గండికోటలో తొలిసారి హెలికాప్టర్ ఎక్కేయండి..!

image

గండికోట ఉత్సవాలు ఈనెల 11, 12, 13న జరగనున్నాయి. టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి అందించడానికి గండికోటలో మొదటిసారిగా హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున వసూళ్లు చేస్తారు. కాసేపు గండికోటలో హెలికాప్టర్‌లో తిప్పుతారు. సంబంధిత వాల్‌పోస్టర్లను కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP నేత శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.

News January 8, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు ఇలా..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం గ్రాము: రూ.13920
22 క్యారెట్ల గ్రాము ధర: రూ.12806
*వెండి 10 గ్రాములు: : రూ.2,435