News September 2, 2025

ప్రొద్దుటూరు: వృద్ధాప్యంలో క్షోభకు గురిచేస్తున్న కుమార్తె

image

వృద్ధాప్యంలో తమను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కూతురే క్షోభకు గురుచేస్తోందని ప్రొద్దుటూరు (M) భగత్ సింగ్ కాలనీలోని మస్తానయ్య, దస్తగిరమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారిని చదివించి వివాహాలు చేశారు. 4 నెలల క్రితం పెద్ద కూతురు తమ బాగోగులు చూసుకుంటుందని నమ్మించి ఇంటిని రాయించుకుంది. ఆ తర్వాత తమని పట్టించుకోలేదని, న్యాయం చేయాలని వారు జమ్మలమడుగు RDOను ఆశ్రయించారు.

Similar News

News September 2, 2025

కడప: అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచాలని మంత్రి లోకేశ్‌కు వినతి

image

అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచి ఆదుకోవాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేశ్‌ను అంగన్వాడీలు కలిశారు. అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం ఏర్పాటు చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. ఇoదుకు స్పందించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవ్వగానే వేతనాలు పెంచుతామన్నారు.

News September 2, 2025

చింతకొమ్మదిన్నె: ‘విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి లోకేశ్

image

చింతకొమ్మదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి ఆశయాలు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానమిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించారు. విద్యార్థులు మంత్రి మాటలతో ఉత్సాహం పొందారు.

News September 2, 2025

దువ్వూరు: రూ.10 వేల కోసం స్నేహితుడిని హత్య చేశాడు

image

దూవ్వురు మండలం భీమునిపాడులో సోమవారం హత్య జరిగింది. తాను ఇచ్చిన రూ.10 వేలు తిరిగి చెల్లించమని దస్తగిరిని స్నేహితుడు దివాకర్ అడగడంతో ఇరువురు ఘర్షణ పడ్డారు. దీంతో దివాకర్‌ తలపై దస్తగిరి గట్టిగా రాయితో కొట్టాడు. గాయాలపాలైన అతడిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దివాకర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.