News June 11, 2024

ప.గో: అమాత్యయోగం ఎవరికో..?

image

ఉమ్మడి ప.గో జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ, హ్యాట్రిక్ MLA నిమ్మల రామానాయుడు, ఉండి MLA రఘురామకు అమాత్యయోగం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన ఫైర్ బ్రాండ్ MLA చింతమనేని పేరు, BJP కోటాలో కైకలూరు MLA కామినేని శ్రీనివాస్, జనసేన నుంచి బొలిశెట్టి, పులపర్తి రామాంజనేయులు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

Similar News

News December 19, 2025

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే విజయవంతం చేయాలి: జేసీ

image

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే 2025’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ రాహుల్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుంచి దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్‌గా వీక్షించారు. ఈ నెల 25 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల ద్వారా గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు పెద్దపీట వేయనున్నట్లు జేసీ తెలిపారు.

News December 19, 2025

వీరవాసరం: ప్రజల ముంగిటకే ‘వాట్సాప్‌’ గవర్నెన్స్

image

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’ ప్రచారంలో జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. శుక్రవారం వీరవాసరం రైల్వే స్టేషన్‌ రోడ్డులోని కొత్తపేట సచివాలయం-2 పరిధిలో అధికారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, సమయం వృథా కాకుండా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అన్నారు.

News December 19, 2025

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు నిరాశ

image

ప.గో. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులకు నిరాశ ఎదురైంది. జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సర్వేలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ రావు పేరును బీసీ కోటాలో పరిశీలించారు. అయినప్పటికీ వీరు ఇరువురికీ పదవి దక్కలేదు. చివరికి మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు కట్టబెట్టారు.