News November 4, 2024
ప.గో: ఇందులో తప్పు ఎవరిది..?

భార్య, ప్రియురాలి మధ్యలో నలిగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉంగుటూరు(M) నాచుగుంటకు చెందిన రామయ్య(36)కు ప్రేమ వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడగా ఇది భార్యకు తెలిసింది. భార్యను కాదనలేక, ప్రియురాలిని వదల్లేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గతనెల 17న ప్రియురాలి ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
Similar News
News February 21, 2026
కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా పారదర్శకతతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
News February 21, 2026
నరసాపురం: గాల్లో ఎగురుతూ కరెంటు పనులు!

నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.
News February 21, 2026
భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.


