News March 4, 2026

ప.గో: ఇన్‌ఛార్జ్‌ల ఏలుబడిలో గృహనిర్మాణ శాఖ

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో గృహనిర్మాణ శాఖ రెగ్యులర్ అధికారులు లేక కునారిల్లుతోంది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టులు 2022 నుంచి ఇన్‌ఛార్జ్‌ల ఏలుబడిలోనే ఉన్నాయి. రెండు జిల్లాలో సుమారు లక్షకు పైగా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్న తరుణంలో, పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో పనుల పర్యవేక్షణ కుంటుపడుతోంది. తక్షణమే పూర్తి స్థాయిలో అధికారులను నియమించి, పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Similar News

News April 2, 2026

VZM ఉమ్మడి జిల్లాలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంపు

image

ఉమ్మడి జిల్లాలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ వెలువడింది. విజయనగరం 50 నుంచి 62కు, సాలూరు 29 నుంచి 32కు, నెల్లిమర్ల 20 నుంచి 23కు, పార్వతీపురం 30 నుంచి 36కు, బొబ్బిలి 31 నుంచి 36కు, పాలకొండ 20 నుంచి 28 వార్డులకు పెంచారు. రాజాం అంశం కోర్టులో ఉంది. కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది నోటిఫికేషన్ రానుంది.

News April 2, 2026

ఉమ్మడి ప.గో.లో పెరిగిన వార్డుల సంఖ్య

image

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో కొన్ని మున్సిపాలిటీల స్వరూపం మారనుంది.
నిడదవోలు 28 నుంచి 32
జంగారెడ్డిగూడెం 29 – 32
నరసాపురం 31- 36
ఆకివీడు 20- 28
నూజివీడు 32- 36

News April 2, 2026

నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.