News May 19, 2024
ప.గో.: ‘ఎన్నికల్లో డబ్బు అందిందా..?’

ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ సరిగ్గా జరిగిందా..? లేదా..? ప్రజలను అడిగి తెలుసుకునేందుకు పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన 20 మంది సభ్యుల బృందం పర్యటించినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఇంటింటికీ తిరిగి కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. అందరికీ డబ్బు అందిందా అని అడుగుతున్నారని టాక్. దీంతో కంగుతిన్న ప్రజలు ఇలాంటి విచారణ తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారట.
Similar News
News July 5, 2025
ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News July 5, 2025
మొగల్తూరు: చేపకు మనిషి లాంటి దంతాలు

మొగల్తూరు సుబ్రహ్మణ్యేశ్వం రోడ్లో ఒక రైతుకు చెందిన చేపల చెరువులో రూపు చందు చేపల్లో ఒక చేప వింత పోలికలతో కనిపించింది. మనిషిని పోలిన దవడ పళ్లు ఉన్న చేప దొరికింది. ఇది హర్యానా జాతికి చెందిన చేపని మత్స్యకారులు అంటున్నారు. చేపల పెంపకం దారులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని లేదంటే వేళ్లను కొరికే ప్రమాదం ఉంటుందంటున్నారు.
News July 5, 2025
పారిశుద్ధ్యం పనులపై జేసీ అసహనం

భీమవరం పట్టణంలో చెత్త నిర్మూలనకు ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పారిశుద్ధ్యానికి తీసుకోవలసిన చర్యలపై భీమవరం ఆర్డీవో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎన్ని చర్యలు చేపట్టినా నామ్ కే వాస్తే అనే చందంగా ఉందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.