News June 1, 2024
ప.గో.: ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చినట్లేనా..? మీ కామెంట్..?

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఉమ్మడి జిల్లాలో కూటమికి 12 వస్తాయని, కేకే సంస్థ టీడీపీ-9, జనసేన-6 గెలుస్తాయని ఫలితాలు విడుదల చేశాయి. కాగా తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఏదేమైనప్పటికీ ఫలితాల కోసం మరో 3 రోజులు వెయిట్ చేయాల్సిందే.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?
Similar News
News December 25, 2025
గుండెపోటుతో మొగల్తూరు డిప్యూటీ ఎంపీడీఓ మృతి

మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీఓ ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News December 25, 2025
ఎస్.హెచ్.జీ మహిళల ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి: కలెక్టర్

స్వయం సహాయక సంఘాల మహిళలు నెలకొల్పిన ప్రాజెక్టుల అభివృద్ధిలో యువ విద్యార్థులు భాగస్వాములు కావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం ఆమె అధికారులతో సమీక్షించారు. మహిళలు నడుపుతున్న చాక్లెట్ ఫ్యాక్టరీల ఉత్పత్తులకు వినూత్న మార్కెటింగ్, బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్ బాక్సుల తయారీపై కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొందించాలని, తద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు.
News December 25, 2025
ఎస్.హెచ్.జీ మహిళల ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి: కలెక్టర్

స్వయం సహాయక సంఘాల మహిళలు నెలకొల్పిన ప్రాజెక్టుల అభివృద్ధిలో యువ విద్యార్థులు భాగస్వాములు కావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం ఆమె అధికారులతో సమీక్షించారు. మహిళలు నడుపుతున్న చాక్లెట్ ఫ్యాక్టరీల ఉత్పత్తులకు వినూత్న మార్కెటింగ్, బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్ బాక్సుల తయారీపై కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొందించాలని, తద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు.


