News December 29, 2025

ప.గో: కారుమూరితో సహా 13 మందిపై కేసులు

image

మాజీ మంత్రి కారుమూరి వెంక నాగేశ్వరరావుతో సహా 13 మందిపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈనెల 25న తణుకు మండలం తేతలి వై జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్లెక్సీల ఏర్పాటుపై జరిగిన వివాదంలో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వీరిపై 189(2), 329(2), 223(a) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు.

Similar News

News December 31, 2025

పాలకోడేరు: పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

కుముదువల్లి పంచాయతీ చినపేటలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కలెక్టర్ కుమారుడు చదలవాడ భరత్ వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.

News December 31, 2025

సంక్రాంతి సందడి.. పశ్చిమలో హోటళ్లు హౌస్‌ఫుల్!

image

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప.గో జిల్లాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. పండుగ నాలుగు రోజులు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉండటానికి హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్‌ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల ముందుగానే బుక్‌ చేసుకోవడంతో పండుగ సమయంలో హోటల్‌ రూమ్‌లు దొరకడంలేదు. నాలుగు రోజుల్లో రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

News December 31, 2025

జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదవాల నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్లను సచివాలయ సిబ్బంది నేరుగా అందజేస్తారని పేర్కొన్నారు. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.