News March 28, 2024
ప.గో : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
పాలకొల్లు నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 3, 2024
ఏలూరు: నేడే టెట్ పరీక్ష నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఏలూరు జిల్లాలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈవో అబ్రహం సూచించారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నిర్ణీత వేళకు పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సిందే. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం గంట ముందుగా అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు.
News October 2, 2024
జాతీయస్థాయి పోటీలకు కొయ్యలగూడెం విద్యార్థి
కొయ్యలగూడెం వీఎస్ఎన్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి వై.రాహుల్ పల్నాడు జిల్లాలో జరిగిన స్టేట్ లెవెల్ క్రీడల్లో పాల్గొని, జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరెస్పాండెంట్ స్వామి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి రాహుల్ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.
News October 2, 2024
నల్లజర్ల: జీవో ఇచ్చి మరీ మోసం చేశారు: ప్రసాద్
రాజమండ్రి ఎంపీ పురందీశ్వరితో పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం నల్లజర్లలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తమ వేతనాల విషయంలో జీవో ఇచ్చి మరీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కుటుంబ పోషణ భారంగా ఉందన్నారు. న్యాయం చేయాలని ఎంపీకి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.