News December 22, 2025
ప.గో: చేపల వేటకెళ్లొస్తుండగా ప్రమాదం.. ఇద్దరి మృతి

కలిదిండి(M) మద్యానిగూడెం వంతెన వద్ద ఆదివారం బొలెరో బోల్తా పడిన ఆంజనేయులు (50), వెంకటేశ్వర్లు (52) <<18632614>>మృతి చెందిన సంగతి తెలిసిందే<<>>. చేపల వేట ముగించుకుని తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయి వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆంజనేయులు కుమారుడు వెంకటకృష్ణ తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ వి. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 22, 2025
అంటే.. ఏంటి? Extravaganza

విలాసం, కనువిందుగా కార్యక్రమం జరిగింది అని చెప్పే సందర్భంలో ఈ పదం వాడుతారు. ఇది ఇటాలియన్ భాషలోని Estravaganza పదం నుంచి పుట్టింది.
అంటే.. ఏంటి?లో రోజూ 12pmకు కొత్త పదం అర్థం, పద పుట్టుక వంటి వివరాలు తెలుసుకోండి.
<<-se>>#AnteEnti<<>>
News December 22, 2025
CSIR-NEERIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

CSIR-నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(NEERI)లో 14 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.Tech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://neeri.res.in
News December 22, 2025
భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం

AP: నిర్మాణరంగం పుంజుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు ప్రోత్సహించేలా నిబంధనలను సరళతరం చేసింది. ఇప్పటివరకు భవనం 18 మీటర్లు దాటి ఎత్తు ఉంటే హైరైజ్ నిబంధనలు వర్తించేవి. దాన్ని 24 మీటర్లకు పెంచింది. స్థిరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో IGBC సిల్వర్, గోల్డ్, ప్లాటినం కేటగిరీల్లో ఉంటే నిర్మాణ అనుమతుల ఫీజులో వరుసగా 10, 15, 20 శాతం రాయితీని అందించనున్నారు.


