News November 15, 2025
ప.గో జడ్పీ కార్యాలయంలో 14 మందికి ప్రమోషన్స్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న 14 మంది దిగువ శ్రేణి సిబ్బందికి పదోన్నతి కల్పిస్తూ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ శనివారం ఉత్తర్వులు అందజేశారు. జిల్లా పరిషత్ యాజమాన్యం తమ శ్రమను గుర్తించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమర్థవంతంగా పనిచేయాలని పద్మశ్రీ సూచించారు.
Similar News
News November 15, 2025
GNT: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు

రైతులకు ధాన్యం విక్రయాన్ని సులభం చేస్తూ కొత్త వాట్సాప్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇకపై 7337359375 నంబర్కు “Hi” పంపితే వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులు అమ్మదలచిన ధాన్య రకం, బస్తాల సంఖ్య, దగ్గర్లోని కేంద్రం, తేదీ-సమయం వివరాలు పంపగానే స్లాట్ ఆటోమేటిక్గా బుక్ అవుతుంది. ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు చేసే దిశగా ఈ చర్య ముందడుగుగా రైతులు భావిస్తున్నారు.
News November 15, 2025
శాశ్వతమైన ఆనందానికి మార్గం ఏదంటే..?

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ ||
ఆరంభం, అంతం లేనివాడు, సకల లోకాలకు మహేశ్వరుడు, సమస్త ప్రపంచానికి అధిపతి అయిన మహావిష్ణువును నిత్యం స్తుతించి, ధ్యానించే భక్తుడు సమస్త దుఃఖాలను దాటి మోక్షాన్ని పొందుతాడు. శ్రీమన్నారాయణుడిని నిరంతరం స్మరించడమే మనకు శాశ్వతమైన శాంతి, ఆనందాన్ని ప్రసాదించే దివ్య మార్గం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 15, 2025
GWL: రబీ సీజన్కు సాగునీరు ఇవ్వలేం- డిప్యూటీ సీఎం

కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర డ్యాం పరిధిలోని ఆయకట్టుకు రబీలో సాగునీరు ఇవ్వలేమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీబీ డ్యాం పరిధిలోని ఆయకట్టు రైతులు సహకరించాలన్నారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.


