News February 20, 2025

ప.గో : జాతీయ కబడ్డీ పోటీలకు శ్రీకాంత్ ఎంపిక

image

ఆంధ్ర పురుషుల కబడ్డీ జట్టులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జి.శ్రీకాంత్ ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 3వతేదీ నుంచి 18వ తేదీ వరకు విశాఖలో 20 మంది ప్రాబబుల్స్‌కు శిక్షణ జరిగిందన్నారు. దీనిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జట్టులో 12 మందిని ఎంపిక చేశారన్నారు.

Similar News

News February 21, 2025

మొగల్తూరు : పేరుపాలెం బీచ్ సమీపంలో వ్యక్తి సూసైడ్

image

పేరుపాలెం బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపిన వివరాలు.. రిసార్ట్ సమీపంలోని సీఆర్ జెడ్ పరిధిలోని తోటలో గుళికలు తిని మృతిచెందాడు. అయితే అతని జేబులో ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు ఉందని , ఫోన్ లాక్ ఓపెన్ కాలేదని వీఆర్వో దుర్గారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడిది కృష్ణా జిల్లా కృతివెన్నుగా అనుమానిస్తున్నారు.

News February 21, 2025

భీమడోలు: కుళ్లిన ఎగ్ పఫ్ విక్రయాలు

image

భీమడోలు జంక్షన్‌లోని ఓ బేకరీలో గురువారం రాత్రి కుళ్లిన ఎగ్ పఫ్‌లను విక్రయించడం వివాదాస్పదమైంది. భీమడోలు మండలం పెదలింగంపాడు గ్రామానికి చెందిన పులిపాటి రాజు అనే వ్యక్తి ఎగ్ పఫ్‌లను కొని ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లలు వాటిని తినే సమయంలో దుర్వాసన రావడంతో ఊసేశారు. దీంతో రాజు బేకరీ వద్దకు వెళ్లి, వ్యాపారిని నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రాజు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

News February 21, 2025

పా.గో: గవర్నర్‌కు మాజీ మంత్రుల వినతులు

image

వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైయస్ జగన్‌కి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

error: Content is protected !!