News December 23, 2025
ప.గో: జిల్లాకు 5,288 టన్నుల యూరియా సరఫరా

జిల్లాకు డిసెంబర్ నెలకు సంబంధించి 23,018 టన్నుల యూరియా తాడేపల్లిగూడెం రైల్వే ర్యాక్కు వచ్చిందని, ప్రైవేట్ డీలర్లు, మార్క్ ఫెడ్, సొసైటీలకు 5,288 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు ఏడీఏ ఆర్.గంగాధర్ రావు మంగళవారం తెలిపారు. తాడేపల్లిగూడెం 1,653, పెంటపాడు 485 టన్నులు డీలర్ల వద్ద నిల్వ ఉందన్నారు. యూరియా నిల్వలను ప్రైవేట్, సొసైటీ, రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Similar News
News December 30, 2025
కలెక్టర్కి పదోన్నతి.. అధికారుల అభినందనల వెల్లువ

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం పీజీఆర్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో శివనారాయణ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు కలెక్టర్ను కలిసి అభినందనలు తెలియజేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
News December 30, 2025
కలెక్టర్కి పదోన్నతి.. అధికారుల అభినందనల వెల్లువ

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం పీజీఆర్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో శివనారాయణ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు కలెక్టర్ను కలిసి అభినందనలు తెలియజేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
News December 29, 2025
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి: జేసీ

రబీ సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుండి రైతు ప్రతినిధులు, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆయన సమీక్షించారు. అన్ని మండలాల్లో అవసరమైన మేర నిల్వలు ఉండేలా చూడాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. సాగు అవసరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


