News October 20, 2024
ప.గో జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఖరారు

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ను ఖరారు చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం సందిగ్ధత నెలకొంది. దీంతో నేడు విడుదల చేసిన ప్రకటనతో ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిపై స్పష్టత వచ్చింది.
Similar News
News December 28, 2025
నరసాపురంలో నిర్మలా సీతారామన్ పర్యటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నరసాపురం మండలం పెదమైనవానిలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ను ప్రారంభించారు. పాఠశాలలోని వసతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో చర్చించారు.
News December 28, 2025
పశ్చిమ గోదావరి కలెక్టర్కు పదోన్నతి

ప్రభుత్వం 2010 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్ టైమ్ స్కేల్ (లెవల్-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
News December 28, 2025
పశ్చిమ గోదావరి కలెక్టర్కు పదోన్నతి

ప్రభుత్వం 2010 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్ టైమ్ స్కేల్ (లెవల్-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.


