News April 7, 2024
ప.గో.: టీడీపీకి షాక్.. బీసీ నేత రాజీనామా

ప్రముఖ బీసీ నేత, బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్ చలమోలు అశోక్ గౌడ్ శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అవమానాలు, వేధింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటే ఆత్మాభిమానం కలిగిన వర్గాలే తప్ప పల్లకీలు మోసే బోయలు కాదని అన్నారు.
Similar News
News February 28, 2026
ఉండి: గ్యాస్ ప్రమాదం ఘటనలో మరో మహిళ మృతి

ఉండి చిక్కాల వీరన్న నగరంలో ఈనెల 24వ తేదీన జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి చెందారు. ఎస్సై నజీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ సర్వీస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో లక్ష్మి (50) గురువారం మృతి చెందింది. ఆమె తల్లి సుబ్బాయమ్మ (70) ఇప్పటికే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు విజయవాడలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
News February 28, 2026
నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.
News February 28, 2026
పాతకక్షల భగ్గు: భీమవరంలో దారుణ హత్య

2022 డిసెంబరులో రఘు సోదరుడు ఏసు హత్యతో రెండు వర్గాల మధ్య కక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 17న గోవింద్, తన సోదరుడు విజయ్తో కలిసి భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వస్తుండగా.. గొల్లవానితిప్ప రోడ్డులోని కనకదుర్గ ఆలయం వద్ద రఘు తన అనుచరులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ అక్కడి నుంచి పరారయ్యాడు.


