News May 30, 2024
ప.గో: ‘నేను గెలుస్తానా..? లేదా..? చెప్పండి’
జూన్ 4 కోసం అభ్యర్థులు, ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్కు మరో 4రోజులే గడువు ఉండగా ఉమ్మడి ప.గో జిల్లాలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. పోలింగ్ తర్వాత విహారయాత్రలకు వెళ్లిన అభ్యర్థులు, నేతలు తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. ఎవరికి వారు సర్వేలు చేయించుకున్నప్పటికీ ఓటరు నాడీ పట్టలేక న్యూమరాలజీ, జ్యోతిషం చెప్పవారిని ఆశ్రయిస్తున్నారు. ‘నేను గెలుస్తానా లేదా చెప్పండి’ అంటూ స్పష్టత తీసుకుంటున్నారట.
Similar News
News September 29, 2024
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై చీటింగ్ కేసు
ఏలూరు మాజీ MLA ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది. త్రీ-టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచార సమయంలో ఏలూరులోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన తనను ఆదుకుంటానని, వైద్య ఖర్చులు భరిస్తానని చెప్పిన ఆళ్ల నాని.. ఆ తర్వాత పట్టించుకోలేదని అవుటుపల్లి నాగమణి అనే మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో నానితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు.
News September 29, 2024
TDP ఉభయ గోదావరి జిల్లాల MLC అభ్యర్థి ఖరారు..?
TDP ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు లేదా SC సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి జవహర్తో పాటు పలువురి పేర్లు పరిశీలించినా, చివరికి ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐ.పోలవరానికి చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా జనసేనకు ఇచ్చారు.
News September 29, 2024
సెప్టెంబర్ 30న ఉమ్మడి ప.గో. విద్యార్థులకు పోటీలు
ఉమ్మడి ప.గో. జిల్లాలోని విద్యార్థులకు సెప్టెంబర్ 30న ‘సేవ్ ది గర్ల్’ అంశంపై వ్యాసరచన, డెబిట్, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని ఆయా జిల్లాల శాఖ అధికారులు శనివారం తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు చేపడుతున్నామన్నారు. మొదటి విజేతకు రూ.5 వేలు, 2వ విజేతకు రూ.3 వేలు, 3వ విజేతకు 2 వేలను బహుకరిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 1న భీమవరం పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో పోటీలు ఉంటాయన్నారు.