News June 16, 2024
ప.గో: బ్యాటరీని మింగిలిన చిన్నారి.. సేఫ్

ప.గో జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 11నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున ఓ బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు.
Similar News
News April 14, 2026
TPG: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన తాడేపల్లిగూడెం మండలం పడాల ఒక పత్రిక కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వివరించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
News April 14, 2026
ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రకటనలతో జాగ్రత్త: డీఈవో

అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
News April 14, 2026
కలెక్టరేట్లో ఉద్యోగాలంటూ SMలో వైరల్.. ఖండించిన కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లో రాత పరీక్ష లేకుండా 40 పోస్టుల భర్తీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఖండించారు. ఈ వీడియోలు పూర్తిగా అవాస్తవమని, నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే ఒకటికి రెండుసార్లు అధికారికంగా సరిచూసుకోవాలని ఆమె సూచించారు. నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.


