News March 19, 2025

ప.గో: మినహాయింపు కోరుతూ డీఈవోకి వినతి 

image

ఏప్రిల్ మూడో తేదీ నుంచి జరగనున్న పదో తరగతి స్పాట్ మూల్యాంకనంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న వారికి మినహాయింపు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓకి వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు మాట్లాడుతూ ప్రెగ్నెంట్ ఉమెన్, 60 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News March 19, 2025

ప.గో : అమ్మకు చీర కొనడానికి దొంగతనం.. చివరికి

image

ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన సురేందర్ తెలంగాణలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పోలీసులు మంగళవారం సురేందర్ నేరాలను వివరించారు. 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దొంగతనం చేసినట్లు వెల్లడించారు. మొదటిసారి అమ్మకు చీర కొనడానికి రూ.300 దొంగతనం చేశాడన్నారు. అతడి వద్ద రూ. 45 లక్షల సొత్తు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.

News March 19, 2025

ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

image

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

News March 19, 2025

ఆకివీడు: భార్య ఫ్రెండ్‌పై అత్యాచారయత్నం

image

ఆకివీడు మండలం చెరుకుమిల్లి శివారు ఉప్పరగూడెం గ్రామానికి చెందిన  ద్రోణాద్రి నరసన్న అదే గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నరసన్న భార్య కువైట్ వెళ్లింది. తన భార్యతో ఫోన్లో మాట్లాడాలని స్నేహితురాలిని ఇంటికి పిలిచాడు. ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. మహిళ ఫిర్యాదుతో ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!