News May 5, 2024
ప.గో: రుద్రమదేవి ఏలిన గడ్డ.. ఈసారి ఎవరిదో అడ్డా?

రాణి రుద్రమదేవి ఏలిన పోరుగడ్డ మన నిడదవోలు. బ్రిటిష్ వారి వ్యాపారాలకు జల రావాణాలో ముఖ్య కేంద్రం ఇది. 2008 వరకు కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు.. ఆ తర్వాత విడిపోయింది. ఇప్పటివరకు ఇక్కడ 3సార్లు ఎన్నికలు జరగగా.. 2009, 14లో టీడీపీ, 2019లో వైసీపీ విజయం సాధించాయి. 4వ సారి జరుగుతున్న పోరులో కందుల దుర్గేశ్(జనసేన), శ్రీనివాస్ నాయుడు (వైసీపీ), పెద్దిరెడ్డి సుబ్బారావు(కాంగ్రెస్) తలపడుతున్నారు.
Similar News
News July 10, 2025
641.544 కిలోల గంజాయి ధ్వంసం చేసిన: ఎస్పీ

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 641.544 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ అర్బన్ మేనేజ్మెంట్ ఈ-వేస్టేజ్ లిమిటెడ్లో అధికారులు ధ్వంసం చేశారు. 64 కేసులకు సంబంధించిన ఈ గంజాయిని బాయిలర్లో వేసి కాల్చివేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ఆపరేషన్లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News July 10, 2025
అవార్డులు అందుకున్న ముగ్గురు జిల్లా అధికారులు

విజయవాడలో బుధవారం జరిగిన సభలో రెడ్క్రాస్ నిధుల సేకరణలో విశేష కృషి చేసిన ముగ్గురు జిల్లా అధికారులకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మెడల్స్ అందించి, సత్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జె.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వేణుగోపాల్, రిటైర్డ్ డీఈఓ వెంకటరమణలు ఈ మెడల్స్ను అందుకున్నారు. వీరు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రెడ్క్రాస్ సేవల కోసం రూ.5 లక్షలకు పైగా నిధులు సమకూర్చారు.
News July 10, 2025
జిల్లాలో 3 ప్రమాదకర కెమికల్ పరిశ్రమలు: కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ప్రమాదకర కెమికల్ పరిశ్రమలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్ మీట్లో ఆమె మాట్లాడారు. తణుకు ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్, తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయని, భీమవరం డెల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్ మూసివేశారన్నారు. 34 పరిశ్రమలు సాధారణ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయన్నారు.