News September 16, 2024
ప.గో: రూ.20కే 11కేజీల లడ్డూ..!
మీరు చదివింది నిజమే. రూ.20కే 11 కేజీల గణేశ్ లడ్డూ ఇవ్వనున్నారు. ప.గో జిల్లా పోడూరు మండలం మట్టపర్రులో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 11 కేజీల లడ్డూను రూ.20కే అందించడానికి నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం లడ్డూకు సంబంధించిన లక్కీ డ్రాను తీయనున్నారు. మరి ఆ లడ్డూ ఎవరికి దక్కుతుందనేది మరికాసేపట్లో తెలియనుంది. మరి మీ ఏరియాలోనూ ఇలాంటి లక్కీ డ్రా నిర్వహించి ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News October 15, 2024
ఉమ్మడి ప.గో జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
ఉమ్మడి ప.గో జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప.గో జిల్లాకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ను నియమించారు. అలాగే ఏలూరు జిల్లాకు మంత్రి నాదెండ్ల నియమితులయ్యారు. వారు జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యకలాపాలలో భాగస్వాములు కానున్నారు.
News October 15, 2024
ఏలూరు జిల్లాలో 12 మంది మహిళలకు వైన్ షాపులు
ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన మద్యం దుకాణాల లాటరీ విధానంలో పలువురు మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. జిల్లాలో 144 మద్యం దుకాణాలకు 5,499 మంది టెండర్లు దాఖలు చేయగా, 144 మద్యం షాపులకు లక్కీడిప్ ద్వారా 144 మందిని ఎంపిక చేసినట్లు కలెక్టర్ చెప్పారు. అయితే వీరిలో 12 మంది మహిళలు మద్యం దుకాణాలను లాటరీ విధానంలో కైవసం చేసుకున్నారు.
News October 14, 2024
ఏలూరు ఎస్పీ పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.