News August 15, 2024
ప.గో.: రెండు గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదన

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన బాలిక 14వ తేదీ (నిన్న) రాత్రి కిడ్నాప్కు గురైంది. బాలిక తండ్రి పాలకోడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. రాత్రివేళ బొలెరో వాహనంలో వచ్చి తన కూతురుని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు రంగంలో దిగారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి పాలకోడేరుకు చెందిన హనుక్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా SP సిబ్బందిని అభినందించారు.
Similar News
News September 19, 2025
ఏలూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ఏలూరు రూరల్ పరిధిలోని ఓ దాబాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరు యువతులను అరెస్టు చేశామని SI నాగబాబు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వహకుడిపై కేసు నమోదు చేశామన్నారు.
News September 19, 2025
కార్యాలయాల్లో ఇ – ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి: కలెక్టర్

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ – ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి అని, జిల్లా ప్రగతికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పలు అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలన్నారు. కాగితం దస్త్రాలను క్రమేపి తగ్గించాలన్నారు.
News September 19, 2025
5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.