News February 24, 2025
ప.గో: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.
Similar News
News November 2, 2025
నరసాపురం: ‘లోక్ అదాలత్పై దృష్టి సారించాలి’

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్పై ప్రత్యేక దృష్టి సారించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. ఈ మేరకు శనివారం నరసాపురం కోర్టు హాలులో పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
News November 1, 2025
నరసాపురం: ‘లోక్ అదాలత్పై దృష్టి సారించాలి’

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్పై ప్రత్యేక దృష్టి సారించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. ఈ మేరకు శనివారం నరసాపురం కోర్టు హాలులో పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
News November 1, 2025
భీమవరం: పింఛన్లు అందజేసిన కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ చుట్టుపక్కల శనివారం లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. లబ్దిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా అని ఆరా తీశారు.


