News November 7, 2024
ప.గో రైతులకు గమనిక

ప.గో.జిల్లాలో 22 రైతు సేవా కేంద్రాల ద్వారా 128 మంది రైతుల నుంచి 11,770 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత సీజన్లో కనీస మద్దతు ధర క్వింటాల్ సాధారణ రకం రూ.2,300, గ్రేడ్-ఏ రకం రూ.2,320 చొప్పున నిర్ణయించినట్లు చెప్పారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి సమస్యలుంటే కంట్రోల్ రూం 8121676653కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News July 9, 2025
‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.
News July 9, 2025
ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం: కలెక్టర్ నాగరాణి

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్స్ జరగాలని, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.
News July 8, 2025
‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.