News December 6, 2025

ప.గో: వెండితెరపై నవ్వులు పూయించిన నటుడు ఇక లేరు

image

వెండితెరపై తనదైన హాస్యంతో అలరించిన అలనాటి నటుడు, పాస్టర్ జోసెఫ్ గుండెపోటుతో మరణించారు. గురువారం చిలకలూరిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మార్గమధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనుకు చెందిన జోసెఫ్.. ‘పాతాళభైరవి’ సహా ఆరు చిత్రాల్లో నటించారు. కృష్ణ, కృష్ణంరాజు, కమలహాసన్‌ వంటి అగ్రనటులతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాస్టర్‌గా ఆయన ప్రసంగంలో నవ్వులు పూయించేవారు.

Similar News

News December 6, 2025

భద్రాద్రి: 3వ విడతలో అందిన నామినేషన్ల వివరాలు

image

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి రోజు నాటికి అందిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వెల్లడించారు. వివరాలిలా.. ఆళ్లపల్లి – 63, 234, గుండాల – 70, 271, జూలూరుపాడు – 124, 452, లక్ష్మీదేవిపల్లి – 164, 661, సుజాతనగర్ – 79, 271, టేకులపల్లి – 244, 685, ఇల్లందు – 196, 680, మొత్తం సర్పంచ్ – 940, వార్డు మెంబర్లు – 3254 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

News December 6, 2025

త్వరలో హీరో సుశాంత్‌, హీరోయిన్ మీనాక్షి పెళ్లి? క్లారిటీ..

image

టాలీవుడ్ హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు SMలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె టీమ్ ఖండించింది. ఇందులో నిజం లేదని, వారిద్దరూ ఫ్రెండ్స్ అని పేర్కొంది. ఏదైనా సమాచారం ఉంటే అఫీషియల్‌గా తామే ప్రకటిస్తామని తెలిపింది. కాగా సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో మీనాక్షి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలోనూ వీరి పెళ్లిపై వార్తలు రాగా మీనాక్షి ఖండించారు.

News December 6, 2025

HYD: మహా GHMC‌లో 250 డివిజన్లు.!

image

గ్రేటర్‌లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్‌ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్‌లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్‌లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.