News February 10, 2025

ప.గో: వేరు వేరు ఘటనల్లో నలుగురి ఆత్మహత్య

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ఆదివారం వేరువేరు ఘటనల్లో నలుగురు సూసైడ్ చేసుకున్నారు. ద్వారకాతిరుమల తిమ్మాపురానికి చెందిన సోమశేఖర్ (42) కడుపునొప్పితో, పెదవేగిలోని రాట్నాలకుంటకు చెందిన మరియమ్మ కొడుకు కాలేజీ ఫీజుకోసం దాచిన సొమ్ముతో భర్త మద్యం తాగేశాడని సూసైడ్ చేసుకుంది. అలాగే అనారోగ్యంతో దొంగలమండపానికి చెందిన మాధవి విషం తాగింది. వారితో పాటు పాలకోడేరుకు చెందిన యడ్ల చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు.

Similar News

News September 18, 2025

VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

image

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.

News September 18, 2025

యూరియా తగినంత ఉంది కలెక్టర్ కీర్తి

image

జిల్లాలో యూరియా కొరతపై వ్యాపించిన వదంతులను నివృత్తి చేయడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామాన్ని సందర్శించారు. దొమ్మేరు ప్యాక్స్ వద్ద రైతులు, అధికారులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో యూరియా తగినంత నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

News September 18, 2025

నేను అన్ని మతాలను విశ్వసిస్తా: CJI గవాయ్

image

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వస్తున్న విమర్శలపై CJI గవాయ్ స్పందించారు. ‘నేను అన్ని మతాలను విశ్వసిస్తా, గౌరవిస్తా. నా వ్యాఖ్యల్ని SMలో తప్పుగా చూపించారు’ అని అన్నారు. ఖజురహోలో ధ్వంసమైన విష్ణువు విగ్రహ పునర్నిర్మాణానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను ఇటీవల SC తిరస్కరించింది. ఈ సందర్భంగా ‘ASIని సంప్రదించండి లేదా ఏదైనా చేయమని దేవుడినే వేడుకోండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.