News September 7, 2024
ప.గో.: స్కూటీ డిక్కీలో పాము (PHOTO)

పెనుమంట్ర మండలం మార్టేరులో శుక్రవారం రాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీలోకి జెర్రిపోతు జాతికి చెందిన పెద్దపాము చొరబడింది. వివరాలు.. గ్రామానికి చెందిన మహమ్మద్ బాషాకి చెందిన స్కూటీలోకి పాము ప్రవేశించినట్లు ఆయన కుమారుడు యూసుఫ్ గమనించాడు. దీంతో స్కూటీ ముందుభాగాన్ని తొలగించగా పాము వెళ్లిపోయింది. వర్షాకాలం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News December 21, 2025
వీరవాసరంలో రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్

వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ ZPHSలో సోమవారం నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO నారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ వి. పూర్ణచంద్రరావు ఆదివారం తెలిపారు. ఒక్కో మండలం నుంచి 11 ఉత్తమ ప్రదర్శనలు ఈ మేళాలో కొలువుదీరనున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదిక దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
News December 21, 2025
రేపు భీమవరానికి అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

అటల్-మోదీ సుపరిపాలన బైక్ ర్యాలీ సోమవారం భీమవరం చేరుకుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ యాత్రలో కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, సత్య కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జిల్లా MLAలు పాల్గొంటారన్నారు. బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
News December 21, 2025
కాళ్ల: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ సి.నాగరాణి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం పెదఅమీరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి, చిన్నారులకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గీతాబాయ్, సర్పంచి డొక్కు సోమేశ్వరరావు పాల్గొన్నారు.


