News March 28, 2025

ఫారిన్ వెళ్లిన ఏలూరు SP, JC

image

ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇద్దరూ కలిసి వియత్నాం దేశానికి పయనమయ్యారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఈనేపథ్యంలో ప.గో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌కు ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.

Similar News

News September 18, 2025

జనగామ జిల్లాలో నిరుద్యోగుల నిరీక్షణ!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తామని చెప్పిన రాజీవ్ యువ వికాసం పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రూ.50వేల యూనిట్లను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా యూనిట్లు కేటాయించకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. జనగామ జిల్లాలో 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో యువత ఆశలు సన్నగిల్లుతున్నాయి.

News September 18, 2025

అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

image

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.

News September 18, 2025

ఇది కోట ‘కుక్కల’ బస్టాండ్..!

image

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులను భయపెడుతున్నాయి. దీనికి పైఫొటోనే నిదర్శనం. తిరుపతి జిల్లా కోటలోని RTC బస్టాండ్ లోపల ఇలా పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిచ్చాయి. ఇక్కడ సమయానికి బస్సులు వస్తాయో లేదో తెలియదు గానీ రాత్రి అయితే కుక్కలు ఇలా వచ్చేస్తాయి. పగటి పూట రోడ్లపై వెళ్లే వారిపై దాడులు చేస్తూ కరుస్తున్నాయి.