News November 9, 2025
‘ఫిట్ ఇండియా’కు మద్దతుగా జిల్లాలో సైక్లోథాన్ 5కె ర్యాలీ

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ‘సైక్లోథాన్ 5కె సైకిల్ ర్యాలీ’ని ఉత్సాహంగా నిర్వహించారు. అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణం వద్ద ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది.
Similar News
News November 9, 2025
HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్మెంట్స్లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 9, 2025
మొంథా తూఫాన్ నష్టం నివేదిక అందించండి: మంత్రి పొన్నం

మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నిర్నిత నమూనాలో తుఫాన్ నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని అదేశించాలన్నారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్లు ఎంత మేరకు మరమ్మతులకు అవసరమో తెలుపలాన్నారు.
News November 9, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు బాగుపడేదెన్నడో..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు గుంతలమయంగా మారి, ప్రయాణం నరకంగా మారింది. గతంలో కొందరు నేతలు రోడ్లపైకి వచ్చి గళమెత్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం మినహా క్షేత్రస్థాయిలో రోడ్ల సమస్యకు పరిష్కారం లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతలు పట్టించుకొని రోడ్లను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


