News March 16, 2025

ఫొటో మార్పింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సీతక్క

image

సోషల్ మీడియాలో తన ఫొటో మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర భావజాల నియంత్రణకు నియంత్రణకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠిన తరం చేయాలని సీతక్క అన్నారు.

Similar News

News March 16, 2025

ఒక్క హిట్ కోసం ఈ హీరోల ఎదురుచూపులు!

image

టాలీవుడ్‌లో ఇటు చిన్న కథలు, అటు భారీ సినిమాలు చక్కటి విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. కానీ మిడ్‌రేంజ్‌ హీరోలు మాత్రం ఆ మధ్యలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. విజయ్ దేవరకొండ, గోపీచంద్, నితిన్, వరుణ్ తేజ్, అక్కినేని అఖిల్.. వీళ్లంతా హిట్ చూసి చాలాకాలమే అయింది. అటు మరీ చిన్న సినిమాలు చేయలేక, ఇటు భారీ బడ్జెట్ ఎంచుకోలేక సతమతమవుతున్నారు. ఎలాగైనా హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాలని ఎదురుచూస్తున్నారు.

News March 16, 2025

నేడు జనగామ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కోనాయిచలం వద్ద రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రి, డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

News March 16, 2025

SRPT: మండలానికి మరో రెండు రైతు నేస్తం కేంద్రాలు!

image

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రైతు నేస్తం కేంద్రాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి NLG జిల్లాలో 315 రైతు వేదికల్లో 77 రైతు నేస్తం కేంద్రాలని నిర్వహిస్తోంది. మండలానికి మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రతినెల నిధులు మంజూరు చేసి రైతులకు మరింత పరిజ్ఞానం అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

error: Content is protected !!