News April 14, 2024
ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వారు ఎంతటి వారైనా వదిలేది లేదు: మంత్రి

ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ వారిపై విచరణ జరుగుతుంది. ఆధారాలతో సహా బయటికి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. టాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న ఎంతటి పెద్దవారైనా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరువు అని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు అన్నారు.
Similar News
News April 8, 2026
ఖమ్మం కార్పొరేషన్లో అవినీతి జలగలు

3 లక్షల జనాభా ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. IAS అధికారి అభిషేక్ కమిషనర్గా ఉన్నప్పటికి పాలనపై పట్టు లేకపోవడంతో రెవిన్యూ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కొందరు అధికారులు, సిబ్బంది.. కాంట్రాక్టర్లతో కలిసి అడ్డగోలుగా సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాలకవర్గం పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో KMCపై కలెక్టర్ దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
News April 8, 2026
ఖమ్మం: 11న ఫూలే జయంతిలో పాల్గొనండి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 11న నిర్వహించే జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి పూలమాలలు అర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సంఘాల నాయకులు పాల్గొనాలని సూచించారు.
News April 8, 2026
ఖమ్మం జిల్లాలో 5నియోజకవర్గాలు 8అవుతున్నాయా.. !?

పునర్విభజనలో ఖమ్మం నియోజకవర్గాల సంఖ్య 8కి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరులో కూసుమంచి, తిరుమలాయపాలెం, KMM(R), ఏదులాపురం, నేలకొండపల్లి(C)లో NKP, ముదిగొండ, చింతకాని, KMM 1లో KMM అర్బన్ (C), KMM(2) రఘునాథపాలెం(C), మధిర(C) MDR, ఎర్రుపాలెం, బోనకల్, వైరా(C) వైరా, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు(C)లో KLR, ఏన్కూరు, కామేపల్లి, సింగరేణి, సత్తుపల్లి(C)లో SPL, వేంసూరు, పెనుబల్లి ఉంటాయని ప్రచారం జరుగుతోంది.


