News June 28, 2024

ఫోన్ తీశాడని ఆరోపణలు.. గడ్డి మందు తాగిన బీటెక్ స్టూడెంట్

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో బీటెక్ విద్యార్థి గడ్డి మందు తాగాడు. SI పవన్ వివరాల ప్రకారం.. శివగంగాధర్ అనే యువకుడు చేబ్రోలులోని కాలేజ్‌లో బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు. కాలేజ్‌లో ఫోన్ పోగా.. శివ తీశాడని ఆరోపిస్తూ ఇంటికి పంపేశారు. అలాగే ఎస్సైనంటూ సీనియర్లు శివను కొట్టారని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని అతడి మామ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News July 1, 2024

తూ.గో.: పవన్ కళ్యాణ్ ENTRY

image

డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. గొల్లప్రోలు మండలంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.

News July 1, 2024

తూ.గో.: పిల్లలు పుట్టడం లేదని సూసైడ్

image

తూ.గో. జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాశి (24) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దుర్గారావును ప్రేమవివాహం చేసుకుంది. కాగా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆదివారం కాలువలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు. 

News July 1, 2024

పిఠాపురం: పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న పవన్

image

పిఠాపురం MLAగా గెలుపొంది, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా నియోజకవర్గానికి రానున్నారు. ఉదయం 7:30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 9 గంటలకు చేబ్రోలులోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత 9:45 గంటలకు గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 వరకు అక్కడే ఉండి తిరిగి 1గంటలకు ఆయన నివాసానికి చేరుకుంటారు.