News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. భీములవారిపాళెంలో బోటు షికారు చేద్దాం రండి!

భీములవారిపాళెంలో పడవ షికారు, సరస్సు మధ్యలో పారాగ్లైడింగ్( నీళ్లమధ్యలో గాలిలో ఎగురుతూ విహరించడం) ఏర్పాటు చేశారు. సూమారు 50 వేల మంది వరకు పడవ షికారుకు వస్తారని అంచనా. ఒక్కోపడవలో 20 మందినే అనుమతించి లైఫ్ జాకెట్లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు బోటు షికారు ఉచితం కాగా పెద్దలు రూ.30 టికెట్ తీసుకోవాలి. VIP బోటు షికారు కోసం రెండు ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.
Similar News
News February 6, 2026
HYD: భవనంపై నుంచి దూకి వివాహిత సూసైడ్

కూకట్పల్లిలోని సీబీసీఐడీ కాలనీలో అనిత(23) వివాహిత ఆఫీస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనితకు 2021లో బాచుపల్లి శ్రీనివాస్తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 6, 2026
ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజాసాబ్’

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ అర్ధరాత్రి నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. గత నెల 9న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.
News February 6, 2026
ఆర్మూర్: కుటుంబ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భర్త కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆర్మూర్కు చెందిన వివాహిత సాగరిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధనంగా రూ.20 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు వేధించడంతో తీవ్ర మనోవేధనకు గురై ఉరేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తమ్ముడు సాయి కృష్ణ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.


