News March 28, 2025

బంగారు కవచాలతో భద్రాద్రి రామయ్య దర్శనం

image

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం సందర్భంగా బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారికి విశేషాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి బేడా మండపంలో సంధ్యా హారతులు, ఉత్సవాన్ని జరపనున్నారు. ఈ అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తిలకించారు.

Similar News

News March 31, 2025

ORRపై టోల్ ఛార్జీల పెంపు

image

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్‌)పై టోల్ ఛార్జీలను పెంచేశారు. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు KMకు 10 పైసలు, మినీ బస్, ఎల్‌సీవీలకు KMకు 20 పైసలు, 2 యాక్సిల్ బస్సులకు 31 పైసలు, భారీ వాహనాలకు 69 పైసల చొప్పున పెంచింది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది.

News March 31, 2025

పల్నాడు: రంజాన్ ప్రార్థనలకు వేలాది మంది హాజరు

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గ కేంద్రాలలో మసీదులు కిటకిటలాడాయి. మండల కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. మత ప్రవక్తలు రంజాన్ విశిష్టత తెలియజేశారు. 

News March 31, 2025

మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడి అరెస్ట్!

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా‌కు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాకు షాక్ తగిలింది. రేప్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డైరెక్టర్ లైంగికంగా వేధించాడని, వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ పేరుతో తెరకెక్కించే సినిమాలో మోనాలిసాను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు సనోజ్ ప్రకటించారు.

error: Content is protected !!