News January 25, 2025

బంజారాహిల్స్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బంజారాహిల్స్‌‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌ మీదకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలిపెట్టి అందులో ఉన్నవారు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ వద్దకు చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. కారు నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 16, 2025

జనగామ జిల్లా పర్యావరణ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్‌గా గౌసియా బేగం

image

జనగామ జిల్లా పర్యావరణ పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌గా GCDO గౌసియా బేగంను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హరితదల డైరెక్టర్ WC ప్రసన్నకుమార్ నియామకపత్రం జారీచేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గౌసియా బేగంకు అందజేశారు. ఈ సందర్భంగా అమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గౌసియా బేగం మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తించి, పర్యావరణ జిల్లాకు కృషి చేస్తానని తెలిపారు.

News September 16, 2025

గన్నవరం ఎయిర్ పోర్టులో రేపు ప్రయాణికులకు గ్రాండ్ వెల్కం

image

గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్బంగా యాత్రిసేవా దివస్‌ను బుధవారం నిర్వహించబోతున్నారు. ప్రయాణికులకు క్వాలిటీ సర్వీసెస్‌ అందించడంలో భాగంగా వారికి గ్రాండ్‌గా వెల్కం చేయడం, వైద్య పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు ఎయిర్‌పోర్టు చూపించడం, ఏవియేషన్ రంగంలో ఉద్యోగావకాశాల కల్పనపై తరగతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని చర్యలు తీసుకోనున్నారు.

News September 16, 2025

భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

image

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.