News April 20, 2024

బంటుమిల్లిలో రోడ్డు ప్రమాదం.. వీఆర్ఓ మృతి

image

బంటుమిల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఓ వెంకట వరప్రసాద్(62) మృతి చెందారు. చోరంపూడి వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ శనివారం ఉదయం మచిలీపట్నం నుంచి తన ద్విచక్ర వాహనంపై చోరంపూడి వస్తుండగా కొర్లపాడు వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న మారుతి కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అతడిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News September 10, 2025

కృష్ణా: ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో SP సమావేశం

image

ఎస్పీ ఆర్. గంగాధరరావు ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. పోలీస్‌ సూచనల ప్రకారం వివాదాస్పద, వ్యక్తిగత దూషణల ఫ్లెక్సీలు ముద్రించకూడదని, ఆర్డర్ ఇచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలిని సూచించారు. అసోసియేషన్ సభ్యులు చట్టపరంగా సహకరించి సమాజ శాంతికి కృషి చేయమని ప్రతిజ్ఞ చేసుకున్నారు.

News September 10, 2025

కృష్ణా జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా: యూరియా పంపిణీని పరిశీలించిన కలెక్టర్.
☞ విజయవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్.
☞ కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి.
☞ కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా ప్రమోషన్.
☞ కృష్ణా: 11,12 తేదీల్లో కళా ఉత్సవ్ పోటీలు.
☞ కృష్ణా జిల్లా రైళ్లకు కొత్త స్టాపులు.
☞ విజయవాడలో ఈనెల 26న భారీ ఈవెంట్ ప్లాన్.
☞ కృష్ణా: రీవాల్యూషన్ నోటిఫికేషన్ విడుదల.

News September 10, 2025

కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి

image

పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మరో మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రారంభమై 89 రోజుల్లోనే 8.3 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించి రైతుల ఊపిరిగా మారింది. ఆ తరువాత 2015-19లో 263 టీఎంసీలు, 2019-24లో 165 టీఎంసీలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 11.05 టీఎంసీలు చేరాయి. మొత్తంగా 439 టీఎంసీలు మళ్లించిన ఈ పథకం డెల్టా రైతులకు ఆపద్బాంధవంగా నిలిచింది.